.

మానవుడు 12 సంవత్సరాలలో జీవన్ముక్తిని పొందగలడు.





మనము
భగవంతునికి చేసే పూజలు , నోములు , వ్రతములు , జపములు , తపములు ఫలించి జీవన్ముక్తిని పొందుటకు ద్వాదశాబ్దము లేక పుష్కర కాలము పట్టును. అనగా 12 సంవత్సరముల నిరంతర సాధన మనకు ముక్తిని ఇప్పించును.

అయితే 12 సంవత్సరముల కాలము నిర్ణయించబడేది , లెక్కించబడేది మన కొలమానముతో కాదు. భగవంతుని వద్ద ఉన్న మన ఆధ్యాత్మిక జీవన చిట్టాలో యీ కాలము లెక్కించబడును.

ఒక దినములో ఉన్న 24
గంటలలో యెన్ని నిముషములు మనము ధ్యానములో లయమునొంది ఉందుమో అన్ని నిముషములే భగవంతుని వద్ద నున్న మన చిట్టాలో చేర్చబడును. అటువంటి 60 నిముషములు కలిసి ఒక గంట అగును. అలాంటి 24గంటలు ఎప్పుడు పూర్తి అగునో అప్పటికి (మనము అనుష్టానములో ప్రవేశించి ఎన్ని సంవత్సరములు అయిననూ) భగవంతుని వద్ద ఉన్న మన ఆధ్యాత్మిక జీవన చిట్టాలో ఒక దినము మాత్రమే అగును. అటువంటి 30 దినములు ఒక నెల అగును. అటువంటి 12 నెలలు చేరినప్పుడు ఒక సంవత్సరము ఆగును. విధముగా 12 సంవత్సరములు పూర్తీయినప్పుడు మనకు జీవన్ముక్తి కలుగును.

ఎంత తీవ్ర నిష్ఠతో శ్రద్ధ కలిగి అనుష్ఠించినవాడైననూ ఒక జన్మములో 12 సంవత్సరములు పూర్తిచేయజాలడు. అందుకు భగవంతుడు తనను చేరుకోడానికి 7 జన్మలను మనకు ప్రసాదించాడు. 7 జన్మలలో మనది ఇప్పుడు ఎన్నో జన్మమో !

భగవంతుడు సృష్టించిన కోట్లాది జీవరాసులలో మానవ జన్మ
ఉత్కృష్ఠమైనది , దుర్లభమైనది. మానవ జన్మ పొందిన మనకు మన జన్మ విలువ తెలియదు. మనకు తెలియనంతమాత్రాన దాని గొప్పదనము పోదు.

పుణ్యకార్యములు చేసి స్వర్గమునకు వెళ్ళి దేవతలు అయినవారు
పుణ్య ఫలము అయిపోగానే జన్మ రాహిత్యాన్ని , జీవన్ముక్తిని , మోక్షమును పొందాలంటే మళ్ళీ మానవ వారు మళ్ళీ మనవ జన్మనెత్తి ప్రయత్నించుకోవలసినదే ! అంత గొప్ప జన్మ యీ మానవ జన్మ !

ఒక దినములో యెక్కువ కాలము
నిద్రలోనూ , కాలకృత్యములలోనూ , నైతిక బాధ్యతల నిర్వహణలలోనూ , తక్కిన కాలము వృధాగానూ మనము గడుపుతున్నాము. కనుక 12 సంవత్సరముల కాలమును త్వరగా పూర్తిచేసుకునే ప్రయత్నము కనీసము యిప్పటినుండయినా ప్రారంభిస్తే యీ జీవితానికి సార్ధకత ఉంటుంది!


జై మారుతీ ! జై జై మారుతీ !!



635
సుందరకాండ కధాగాన కార్యక్రమము.

తూర్పు గోదావరి జిల్లాలో , అనపర్తి మండలములో , పొలమూరు గ్రామములో
తేదీ 20-04-2010 మంగళవారము నుండి తేదీ 27-04-2010 27-04-2010 మంగళవారము వరకు 8 దినములు ప్రతీ రోజు సాయంత్రము 6.30 గంటలనుండి 8.30 గంటల వరకు గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి వారి దయతో 635 సుందరకాండ కధాగానము జరుగును. కార్యక్రమము సందర్భముగా సామూహిక శ్రీ రామ కోటి లిఖిత యజ్ఞము జరుగును.

అందరూ ఆహ్వానితులే !
.

దేముడి అడుగుజాడలు


అనంత సాగర తీరం మీద ' మనిషి ' నడుస్తున్నాడు. వేల మైళ్ళు గడచినా తరగని ప్రయాణము. అప్పుడప్పుడు వెనుతిరిగి తాను నడిచిన త్రోవను చూస్తున్న మనిషికి ఆశ్చర్యము అనిపించింది. కారణం.? ...దారిపొడవునా మనిషికి రెండు జతల కాలి జాడలు కనిపించాయి. సముద్ర తీరముమీద రెండు జతల కాలి జాడలను చూసిన మనిషి .. .' నాతో పాటు దేముడు కూడా నడుస్తున్నాడు. ఆయనవే ఈ పాద ముద్రలు ' అనుకున్నాడు

కొంత దూరము తర్వాత మనిషికి కష్టాలు యెదురయ్యాయి. .. బాధలు భయపెట్టాయి... నీరసము ఆవహించింది... నిస్పృహ అమలుకొంది... తూలిపోతూ నడక సాగించిన మనిషి ...తాను నడుస్తున్నాననే స్పృహకూడా కోల్పోయాడు. అలాంటి స్థితిలో మనిషి మళ్ళీ వెనుతిరిగి చూశాడు. అప్పుడు కేవలం ఒక్క జత పాద ముద్రలే కనిపించాయి. దేముడినే పూర్తిగా నమ్ముకొని ఉన్నా కష్ట సమయములో దేముడు తనతో నడవడము లేదనీ , తన రక్షణను గాలికి వదలేశాడనీ మనిషి బాధ పడ్డాడు.

అంత వరకు అదృశ్యంగా అతనితో పాటే నడచిన దేముడు ప్రత్యక్షమయ్యాడు. ' ఆనందంతో ఆరోగ్యంతో నడిచినంత వరకు తాను అతనితోపాటే నడిచాననీ , కళ్ళు తిరిగి తూలిపోయిన మరు క్షణములో మనిషిని తన చేతులతో యెత్తుకొని నడుస్తున్నాననీ , ఇప్పుడు కనిపిస్తున్న ఒక్క జత అడుగుజాడలు తనవేననీ ' దేముడు చెప్పాడు.

....... కరిగి కన్నీరయిన మనిషి దేముడి పాదాలను చుట్టుకున్నాడు.

(----- తేది 17-01-1999 ఆదివారము ఈనాడు లొని 'ఇది కధ కాదు ' సౌజన్యముతో .)

******

గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయతో 634 సుందరకాండ కధాగానము.

తేది 17-04-2010 శనివారము విశాఖపట్నములో , సీతమ్మధార వద్ద , H.B. కోలనీలో , గాయత్రీ దేవి ఆలయ సమీపములో , లక్ష్మీ అపార్టుమెంట్సు యెదురుగా D.no. 55-23-57 లో గల శ్రీ V రాఘవరావు గారి యింటిలో యీ సాధకునిచే 'అభినయ పూర్వక , వ్యాఖ్యాన సహిత 634 సుందరకాండ కధాగానము ' సాయంత్రము 6.00 గంటలకు ప్రారంభింప బడును.

శ్రీ రామ శ్శరణం మమ !!
.

తేది 14-04-2010 న భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టరు అంబేద్కర్ మహాశయుల జయంతి సందర్భముగా నివాళులు.

బ్లాగును చూడండి
భారత దేశము పరపాలన నుండి విముక్తి చెందిననాడు దేశీయమైన చట్టాలు

చేయవలసి వచ్చింది. అప్పుడు పెద్దలు 'పరాశర మహర్షి ' వంశీయుడైన

డాక్టరు అంబేద్కర్ మహాశయులను అర్ధించారు.



ఈ సంధర్భములో " హిందువులకు వేదాలు కావలసినప్పుడు కులహీనుడైన

వ్యాసుడిని
ఆశ్రయించారు. మహాకావ్యము కావలసినప్పుడు అస్పృశ్యుడైన

వాల్మీకిని
కోరారు. ఇప్పుడు రాజ్యాంగము కావలసినప్పుడు నాకు

కబురంపారు "
అన్న అంబేద్కరు ప్రవచనము పాఠకలోకానికి ప్రత్యక్ష

ప్రమాణము.



--- ఈ సాధకుని నాన్నగారి " విజ్ఞాన భాస్కరము" లో 1984 న

సేకరించబడినది.

జై మారుతి ! జై జై మారుతి !!


.

భగవన్నామ సంకీర్తన ప్రభావము. (శ్రీ కుసుమ హరనాథ మహా ప్రభు)





* భగవంతుని యొక్క నామసంకీర్తనములో నీవు పాల్గొనుట వలన అచేతనముగనే నీయందు ప్రభునామ విద్యుచ్చక్తి ప్రవేశించి నీకు ఎనలేని ఆనందము కలిగించును.

* భగవన్నామము చేయునప్పుడు రధము వంటి నీ మనస్సు కోరికలనెడి వందలాది అశ్వములచే లాగబడినప్పటికీ తిరిగి భగవన్నామమనెడు కళ్ళెములచే బంధింపబడును. అందువలననే నీవు జపమాలను ఉపయోగించవలెను.

* అమృతతుల్యమైన " కృష్ణ" నామమును వీడకుము. ప్రాకృతమైన విధులను శ్రద్ధా భక్తులతో పూర్తిచేయుట నీ ధర్మము. ఈ ధర్మమును నిర్వర్తించి అవకాశము కలిగినప్పుడు ప్రభునామ జప , సంకీర్తన , గోష్ఠులలో కాలము గడుపుము. నీవు పొందు ఆనందము విలువ కట్టలేనిది.

* భగవన్నామము వలన సర్వులు ప్రేమమయులై మనవారు అగుదురు. మనము "ఆ జగత్ప్రభువుని వారగుదుము " . ఏ మతము యొక్క సారాంశమైననూ భగవన్నామమే ! భగవనామమును గురించి చెప్పని మతము లేదు.

* నామమును నామమాత్రముగా స్వీకరించకు. నీవు గ్రహించు నామము భగవంతునిది అని గ్రహించి నీ మనస్సు దానియందు లగ్నము చేయుము.

* భగవనామమనెడి విత్తనముచే సత్యగుణమనే మొక్క మొలిచి భక్తియనెడు ఫలము పొందగలము. భక్తి యనెడు మధుర ఫలము వలన ప్రేమ కలుగును. అదియే ప్రేమ స్వరూపమగు ప్రభువు అని గ్రహింపుము.

* భగవన్నామే ఒక మహా మంత్రమైనప్పుడు మరింకేవో మంత్రములున్నవని అనుకొనుట మన మనోదౌర్బల్యము.

* నామ సంకీర్తన నామ జపము వలన నీయందు నిష్కామ ప్రేమ జనించి భగవత్ సాక్షాత్కారము కలుగును.

-- శ్రీ కుసుమ హరనాధ ప్రభు .

( తేది 20-09-96 స్వాతి సపరివార పత్రిక సౌజన్యముతో )


--- తేది 10-04-2010 సాయంత్రము విశాఖ లో m.v.p. కోలనీలో పైలాను నుండి d.r.d.a. ఆఫీసు త్రోవలో సాయి కృప అపార్టుమెంటులో శ్రీమతి ఇందిర గారి గృహములో 633 వ సుందరకాండ కథా గాన కార్యక్రమము సాయంత్రము 6.30 గంటలకు ప్రారంభమవును.

జై మారుతీ ! జై జై మారుతీ !!


.

good friday శుభ శుక్రవారము.--గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక !

గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక !

నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక !
నీ శతృవులకు నీ నామమును తెలియజేయుటకై .... అగ్ని - పొదలను కాల్చు రీతిగాను, నీళ్ళను పొంగజేయు రీతిగాను ...

నీవు దిగి వచ్చుదువు గాక !

జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురు గాక !


నీవు దిగి వచ్చెదవు గాక !


తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి దేవునిని ఎవడు కాలమునా చూచియుండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు.


గగనము చీల్చుకొని నీవు దిగి వచ్చెదవు గాక !


-- యెషయా 64: 1-4

***

మేమందరము అపవిత్రులవంటి వారమయితిమి.
మా నీతి క్రియలన్నియు మురికి గుడ్డ వలెనాయెను.
మేమందరము ఆకువలె మాడిపోతిమి.
గాలివాన కొట్టుకొని పోవునట్టుగా మా దోషములు మమ్ము కొట్టుకొని పోయెను.
నీ నామమను పట్టి మొరపెట్టు వాడొకడును లేక నిన్ను ఆధారము చేసికొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొను వాడొకడున్ లేడు.


--యెషయా 64: 6-8

[తేది 05-07-1996 ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రిక లోని ' అభిమతము ' సౌజన్యముతో ]

మాతృ దేవో భవ ! పితృదేవో భవ !! ఆచార్య దేవో భవ !!!

---- కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
.