.

మాత్రుదేవోభవ! పిత్రుదేవోభవ! ఆచార్యదేవోభవ!

బ్లాగు మిత్రులందరికీ "విజయ దశమి" శుభాభివందనములు.
గురుదేవులు "శ్రీఅంజనేయస్వామి" దయ వలన యీ విధముగా బ్లాగు గ్రూపు ద్వారామీ అందరితో కలిసే అవకాశము కలిగింది.
" మాత్రుదేవోభవ! పిత్రుదేవోభవ! అచార్యదేవోభవ!" అను కోవడము మాత్రమే మనకు తెలుసును. ఆచరణలో పెట్టకపోవడము వలన మనము చాలా కొల్పోతున్నాము.
ప్రత్యక్ష దైవాలయిన మన తల్లితండ్రులను నిరాదరణకు గురిచేసి భగవంతుడిని ఎంత పూజించినా భగవంతుడు మనలను ఆదరించడు. తల్లితండ్రులను పెద్దలను గురువులను గౌరవించకపోతే మన పరిస్తితికూడా అంతే జరుగుతుంది.
మన సనాతన సాంప్రదాయాలనూ ఉమ్మడి కుటుంబ వ్యవస్తలను వదలి పాశ్చ్యాత్తుల ప్రభావములో పడిపోతున్నాము.ఎటో వెళ్ళిపోతున్నాము. ఇది నిత్యమూ ఎందరో పెద్దల మదిలో మెదిలే వ్యధ.
"జై మారుతీ-జై జై మారుతీ"
'శ్రీ మారుతీ పదభక్త - ఉమాప్రసాద్ కొమ్మూరు
.

జై మారుతి

మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ...


మిత్రులందరికి నమస్కారం. నా పేరు కొమ్మూరు ఉమాప్రసాద్. వైజాగ్ వాస్తవ్యుడిని. సామాన్య జీవనము నుండిభగవంతుని కృపచే ఆధ్యాత్మిక మార్గంలోనికి మారి నేటికి 600 పైగా సుందరదాసుగారి సుందరకాండముకథాగానములు, 6వేలకు పైగా ఆధ్యాత్మిక కార్యక్రమముల నిర్వహణ, లక్షకుపైగా హనుమాన్ చాలీసా పుస్తకములముద్రణ, 2 లక్షలకు పైగా హనుమాన్ చాలీసా గానము, 19కోట్లకు పైగా శ్రీరామ నామముల సేకరణలు చేయగలిగాను.


సాగర జలమును కొద్దిగా దోసిలిలో తీసుకున్నా, జలము వేళ్లమధ్యనుంది జారి చివరకు వేళ్లకు తడి మిగులుతుంది. సాధకుని పరిస్థితి అదే. సాధకుడు నిత్య విధ్యార్థే.


వీలయినప్పుడల్లా సాధకుని స్వీయానుభూతులు మీతో పంచుకునే మహత్తర అవకాశం గురుదేవులు శ్రీఆంజనేయస్వామి కల్పిస్తారని ఆశిస్తున్నాను.


జై మారుతి..
.