.

ఆచార్య వినోభాభావే విరచితము: స్వాతంత్రము వచ్చిన తరువాత యేర్పడిన పరిస్థితులపై ఉపనిషత్ పాఠములు.

స్వాతంత్రము వచ్చినపిదప భారతదేశమందు వాడుకలోనున్న అప్పటి శాస్త్రములూ, యంత్రములూ మానవుల ఐహిక అధ్యాత్మిక అభివృద్ధికి, సుఖమునకు పనిముట్లుగా చేసికొనతగినవే కాని వాటికి మానవులు దాసులు కాకూడదు.
స్వతంత్రమునకై జరిగిన ఘోరమైన యుద్ధము ముగియగనే మరల యుద్ధములు, స్వతంత్ర పోరాటములు, సాంఘిక పోరాటములు కలుగకుండ ;
మానవ జాతులలో స్నేహ వాత్సల్యములు, సోదర భావము , శాశ్వత శాంతి స్థాపితమగుటకును ; మానవాభివృద్ధి నిరాటంకము గను , శాంతముగను జరుగుటకును ;
ప్రపంచ పునర్నిర్మాణము యెటుల జరగవలెనను విషయమును గూర్చి ధీమంతులగువారు చర్చించడము మొదలిడినారు.
ఈ మహత్కార్యము జయప్రదముగా నెరవేరుటకు గాను
- తపస్సు, త్యాగము , అందరియందు సమభావము , సత్యము , అహింస [చాంద్యోగ ఉపనిషత్]
- మానవులందరియందును ప్రేమ [బృహదారణ్యక ఉపనిషత్ ]
- ఇతరులకు చెందినదాని కొరకు ఆశింపకుము [ఈశావాస్య ఉపనిషత్ ]
- ధనము కన్న ధర్మమే యెక్కువ [ బృహదారణ్యక ఉపనిషత్ ]

మొదలగు ధర్మముల మీద నిర్మింపబడిన భారతీయ నాగరికతా, ఆధ్యాత్మిక తత్వమే ప్రధాన స్థానమును ఆక్రమించవలసి ఉన్నది. దానిని అన్నిదేశములును గుర్తించు దినములు త్వరలోనే రాగలవు.
కావున మానవజాతి యొక్క శాశ్వతమైన శాంతికి, అభివృద్ధికి -- సర్వతోముఖమైన ఐహిక , ఆముష్మికమైన భారత జాతీయనాగరికత, స్వతంత్రము పునరుద్దరింపబడుట చాల అవసరమైయున్నది. మరియు భారతజాతి యొక్క ఆధ్యాత్మిక తత్వమును యితర జాతులు అవలంబింప వలసియున్నది.

భారతజాతి వేల సంవత్సరములుగ అఖండ త్యాగములచే కాపాడబడిన తన నాగరికతను వదలిపెట్టి విదేశీ నాగరికతలను అవలంబించుటకు యత్నించిన యెడల అది ఆత్మ వినాశకరము.
విదేశ నాగరికత పట్టకపోగా ఉన్నది కూడా పోయి జాతి నశించును. కావున భారతజాతి విదేశముల నుండి మంచివిషయములను నేర్చుకొని తన కార్యక్రమములలో చేర్చుకొనవలెనే కాని విదేశీ నాగరికతల యొక్క వ్యామోహము,అనుకరణము బొత్తిగా పనికి raadu .
ఉపనిషత్ ధర్మములు విశ్వ మానవ koaTiki వర్తించునవై కుల మత బేధములకును ,చెడు సాంఘిక ఆచార్యములకును ,ఎక్కువ తక్కువల అహంకార దోషములకును ఎట్టి అవకాశము లేనివై యున్నవి.

కావున ఉపనిషత్ ధర్మముల ఆచరణము యొక్క పునరుద్ధరణముతో హిందూ ,మహమ్మదీయ , క్రైస్తవ మత బేధములు అంతరించి దేశములో సమానత్వము , సోదరత్వము ,ఐకమత్యము కలుగ గలదు.

ఉపనిషత్ ధర్మము లనెడి గంగా నదీ ప్రవాహముతో -
ఇస్లాము యొక్క ఏకేశ్వరోపాసనము,సోదరత్వము -
క్రైస్తవ మతము యొక్క త్యాగము,ప్రేమ తత్వములు యమునా సరస్వతుల వలె సమ్మేళణమై నవ్య భారత జాతీయ జీవన వాహినిగా ప్రవహించ గలదు.
భారత నూతన జీవము కలిగి నిస్సహాయతకు బదులు ఆత్మ విశ్వాసము, ఆత్మ శక్తి, ఆత్మ స్వాతంత్ర్యములు ,ధైర్య స్థైర్యములు, చురుకుదనము,సోదర భావము, ఐక మత్యము, దైవ భక్తి, పరమార్ధిక చింతనము, అహింసా సత్యములు, స్వార్ధ త్యాగము ,మానవ సేవ యందు అనురక్తి, దేశోద్ధరణ శక్తి మొదలగు సద్గుణములు కలిగి తమ జాతిని సర్వ విధముల ఉద్దరించుకొనుటకు శక్తివంతులమగుదురు.
మానవ జాతి యొక్క నాగరికతా పుష్పమునకు మరల భారతీయ నాగరికతా పుష్పములు నూతన సౌరభమును,శోభను కలుగ జేయగలవు.
[ ఈ వ్యాసము ఆచార్య వినోభా భావే వారిచే రచింప బడినది. అయ్యదేవర కాళేశ్వరరావు గారిచే అనువదించ బడినది. ఈ సాధకుని తండ్రిగారైన కొమ్మూరు భాస్కర రావు గారిచే తేది 09-11-74 న సేకరించ బడినది.] ----------- జై మారుతి!
.

విధ్వంసానికి గురి అయిన భారతీయ మస్తిష్కము!




ఖండ ఖండాంతరాలలో నాగరికత కన్ను విప్పేనాటికే సభ్యతకు, సంస్కారానికి, నైతిక-ధార్మిక ఆదర్శాలకు పేరు పడ్డది మన భరత ఖండము. చతుర్వేదములు ,ఉపనిషత్తులు,రామాయణము ,భాగవతము,అష్టాదశ పురాణములు వంటివి మన కర్మభూమిని ఆధ్యాత్మికముగా శక్తివంతముగా చేస్తుండగా -


అనేక ఋషుల సందేశములతో,అనేక తపశ్శాలుల దివ్య శక్తులతో,పుణ్య క్షేత్రములతో,అనేక తీర్ధములతో,సిరి సంపదలతో బంగరు భూమివలే అలరారుతుండేది .


మన పవిత్ర పుణ్య భూమి అయిన భారతావనిలో యెందరో మహానుభావులు ఉండేవారు -


* వశిష్ఠ ,వాల్మీకి, వ్యాస ,విశ్వామిత్రుల వంటి యెందరో మహర్షులు


*శ్రీరాముడు ,శ్రీకృష్ణుడు, బుద్దుడు, దత్తాత్రేయుడు వంటి అవతార పురుషులు


* గురునానక్,శంకరాచార్యులు ,మధ్వాచార్యులు , రామానుజాచార్యుల వంటి మతప్రవర్తలు


* జ్ఙానేశ్వర్, ఏక్ నాథ్,తుకారాం,నామదేవ్ , మీరాభాయి, రామదాసు, కబీరుదాసు, త్యాగరాజు, రాఘవేంద్రస్వామి, చైతన్య మహాప్రభు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, మోహందాస్ కరంచంద్ గాంధీ, శ్రీ సత్య సాయిబాబా వంటి మహాత్ములు


* రామకృష్ణ పరమహంస ,వివేకానంద, రమణ మహర్షి , అల్లూరి సీతారామరాజు వంటి ఆధ్యాత్మిక వేత్తలు జన్మించారు.


వెయ్యేండ్ల బానిసత్వములో [యింతటి ఘనత కలిగిన మన భరతావనిలో] హైందవ విజ్ఙానము ,విజ్ఙాన కేంద్రాలు చాలా విధ్వంసానికి గురి అయినాయి.


ముస్లింల కాలములో ప్రత్యక్ష విధ్వంసము సాగింది. వారి దండయాత్రలలో అపారమైన ధన సంపత్తులు కొల్లగొట్టబడ్డాయి. అంతే కాదు అనేక క్షేత్రాలలో దేవతా మూర్తులు ధ్వంసమయ్యాయి. హిందూమత పెద్దలు ,భక్తులు హింసించబడ్డారు.


ఆంగ్లేయుల కాలములో భారతీయ మస్తిష్కమే విధ్వంసానికి గురి అయింది.


మన జాతిని శాశ్వతముగా లొంగదీసుకొని ఉంచుకొనడానికి గాను మన మస్తిష్కాన్నే మార్చివేయటము తగిన ఉపాయమని ఆంగ్లేయులు భావించారు.


అందుకు తగిన విద్యా విధానాలు, పద్దతులు ప్రవేశపెట్టారు.


మన ప్రాచీన విజ్ఙాన సర్వస్వాన్ని త్రోసి పుచ్చారు.


పాశ్చత్య రీతుల ఘనతను గురించి మనకు నూరిపోయసాగారు.


పర్యవసానముగా రూపములో భారతీయులుగా ఉంటూ బుద్దిలో పాశ్చాత్యులుగా ప్రవర్తించేవారు పుట్టుకొచ్చారు.


స్వరాజ్యము రాగానే యీ పరిస్తితి మారి భారతీయమైన ప్రజ్ఙ ,మేధస్సు వికసించి ఉండవలసింది కాని అలా జరగలేదు.


జ్ఙానులకు, విజ్ఙానులకు ,వివేకవంతులకు, పండితులకు, ఘనాపాటీలకు, శాస్త్రజ్ఙులకు బుద్దిమంతులకు ,పీఠాధిపతులకు, ఐశ్వర్యవంతులకు, కార్మికులకు కొదువలేదు.


కొరపడింది దేశభక్తి మాత్రమే!


సగటు భారతీయుని గుండెలో గూడుకట్టుకున్న ఆవేదనలు పెద్దలకు అర్ధము కావడము లేదు.


జై మారుతీ! జై జై మారుతీ!!


స్వామి రక్ష! శ్రీ రామ రక్ష!!


శ్రీ రామ రక్ష! సర్వ జగద్రక్ష!!

.

దేశ విభజన తరువాత పరిణామాలు!

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యములో వందల సంవత్సరాలు హీనముగా,బానిసబ్రతుకులు బ్రతికాము. స్వాతంత్ర సాధనకై కోట్లాదిమంది అసువులు బాసారు.కుటుంబ పెద్దలూ యువకులూ కారాగారాలలోనే జీవితాలలో యెక్కువ భాగాన్ని గడిపారు. ఆంగ్లేయులు మనవారిని యెంత హింసించినా అహింసాయుతముగానే స్వాతంత్ర్య ఉద్యమాన్ని నడిపించారు మహాత్మాగాంధీ వంటి యెందరో పెద్దలు.

ఎప్పుడెప్పుడా అని యెదురుచూసిన స్వతంత్రము వచ్చింది. అంతే మనవాళ్ళ ఆనందాలకు హద్దులు లేవు. భారతమాత శృంఖలాలనుండి విముక్తి పొందిందన్న సంతోషముతో ఉవ్వెత్తి ఎగసిపడుతున్న జన సముద్రానికి పిడుగులాంటి వార్త తెలిసింది. అంత వరకు కలసి ఉద్యమాలు నడిపిన కొంత మంది నాయకులు మత ప్రాదికతను అడ్డుపెట్టుకొని తమకు ప్రత్యేకముగా దేశము కావాలని పట్టుపట్టారు. అందరూ నిశ్చేష్టులయ్యారు. ఊహించని ప్రతిపాదన రాగానే యావద్భారతదేశము దిగ్భ్రాంతి చెందింది.

విభజించి పాలించడములో నిష్ణాతులయిన ఆంగ్లేయులు పోతూ పోతూ మతమును ఎరగా చూపించి కొంత మందిలో విషబీజాలు నాటి వెళ్ళిపోయారు. దేశ విభజన అనివార్యమయింది. దేశభక్తులకే కాదు సగటు మనిషికి కూడా కళ్ళంట కన్నీళ్ళు రాలేదు - రక్తాలు కారాయి. కొద్దిమంది స్వార్ధ పూరిత కోరికల కోసము కోట్లాదిమంది బలి అయిపోయారు.

దేశ విభజన సమయములో ఆస్తులనూ, నివాసాలనూ , బ్రతుకు తెరువులనూ,బంధు మితృలనూ, సర్వమునూ వదులుకొని పొట్ట చేతపట్టుకొని అటునుండి యిటూ, యిటునుండి అటూ వలసలు వచ్చేటప్పుడు యెన్నో ఘోరాలు జరిగాయి. స్వాతంత్ర ఉద్యమ నాయకులు బ్రతికి ఉండి జీవచ్చవాలుగా బ్రతికారు.

ఆ తరువాత కొన్నాళ్ళకు మన జాతిపిత మహాత్మాగాంధీ హత్య చేయబడినప్పుడు ప్రపంచములోని ప్రముఖ పత్రికలన్నీ సంపాదకీయాలు వ్రాశాయి. జవహర్ లాల్ నెహ్రూ తన దృష్టికి వచ్చిన అన్ని సంపాదకీయాలను చదివారు. అన్నిటిలోకి ఆయనకు ఒక సంపాదకీయము బాగా నచ్చింది. ఆ సంపాదకీయము మన దేశములోని పత్రికలలో వ్రాసింది కాదు. ఏ పాశ్చాత్య దేశములోని పత్రికలోనో రాలేదు. అది పాకిస్తానులోని ఆంగ్ల పత్రిక పాకిస్తాన్ టైంసు [pakistan taims] ' లో వచ్చింది. ఆ పత్రిక సంపాదకీయుడైన ఫైజ్ అహ్మద్ ఫైజ్ [faij ahmad faij] వ్రాసింది. ఆ సంపాదకీయములో మహాత్ముని ప్రశంస లేదు. ఆయనను హత్య చేసిన ఉన్మాదిని తిట్టడము లేదు. సకల మానవాళి మౌనముగా వ్యక్తము చేసిన ఆవేదనను ఆ సంపాదకీయము ప్రతిఫలించింది.

.

--గాంధీజీని యెవరు హత్య చేసారన్నది అప్రస్తుతమన్నారాయన. దేశ విభజన అనంతరము మహా ఘోరాలు జరిగినప్పుడే మహాత్ముడు మరణానుభూతిని పొందారు.ఇక మిగిలిందేవిటి?అటు తరువాత ఆయనకు ఉన్న స్థానమేవిటి?అన్నారాయన.

దేశ విభజన సృష్టించిన కృత్రిమ సరిహద్దులు ఫైజ్ భారతీయ అభిమానాన్ని యెమాత్రమూ తగ్గించలేకపోయాయి. ఆయన యెన్నో సార్లు మన దేశానికి వచ్చి తన స్నేహితులతో కలిసి మెలిసి తిరిగారు.పాకిస్తాన్ పాలకులు ఆయనను జైలులో పెట్టి కాగితాలు,కలము ఆయనకు అందకుండా చేస్తే -కలాన్ని,కాగితాన్ని లాగేసుకుంటే యెమి పోయింది? గుండె నెత్తురులో వేళ్ళు ముంచి జైలు గోడలపై వ్రాస్తాను అని అలాగే వ్రాసేవారు. ---- ఇది ఒక ఉదాహరణ మాత్రమే!

[ ఈ వ్యాసము ఈ సాధకుని తండ్రిగారైన కొమ్మూరు భాస్కరరావు గారు సేకరించినది. ]

ఆశ్చర్యమైన విషయము యేమిటంటే వందల సంవత్సరాలు మనలను బానిసలుగా చేసి మన దేశసంపదలన్నీ పట్టుకుపోయిన ఆంగ్లేయులు మనకు యిప్పుడు ప్రియమైనవారు . మన నుండి విడిపోయిన మన దాయాదులు మనకు పరమ శతృవులు!

దేశ పౌరుల మనోభావాలను పాలకులు గ్రహించడములేదు.భారత దేశపు గత చరిత్ర చాలా ఘనమయింది. ఆ ఘనత గతానికే మిగిలిపోతున్నట్టుంది.వర్తమానానికీ భవిష్యత్తుకీ ఆ ఘనత కలగానే మిగిలేటట్టుంది. దిక్కు లేని సగటు మనిషికి యిక దేముడే దిక్కు!

జై మారుతీ! జై జై మారుతీ !!

స్వామిరక్ష! శ్రీ రామ రక్ష !!

శ్రీ రామ రక్షా ! సర్వ జగద్రక్ష !!

.