.

శ్రీరామనామములు స్థూపములో నిక్షిప్తము చేయు విధానము.




   ఈ సాధకుడు 9 రోజులు సుందరకాండ కార్యక్రమములు చేసినప్పుదు 1008 శ్రీరామనామములు పట్టు పుస్తకములు ఆసక్తి కలవారికి అందజేసి వ్రాయించి సేకరించినవి 100 పుస్తకములు (ఒక లక్ష శ్రీరామనామములు )  కలిపి కట్టి ఉంచాము. మరలా 3 లక్షల    శ్రీరామనామములు కలిపి  కట్టి ఉంచాము.చిన్న పుస్తకాలు అవడము వలన ఎక్కువ స్థలము  అవడమువలన ( 9 సంఖ్య కోసము )  36 లక్షల శ్రీరామనామములు కలిపి కట్టి  పసుపు రంగు పంచతో   చుట్టి మరల గట్టి తాదులతో  కట్టి ఉంచుతాము పుస్తకముల మధ్యలో వాసన ఉండలు పెడతాము.

   లక్ష శ్రీరామనామములు వ్రాసి ఉన్న పుస్తకాలను 9 పుస్తకాలను కలిపి కట్టి  మరల 9 కట్టలను కలిపి ( 81 లక్షల శ్రీరామనామములు) పసుపు రంగు పంచతో చుట్టి మరల తాడులతో కట్టి ఉంచుతాము.

   ఇక ప్రతిష్టాపనము జరుగు విధానము. వైష్ణవ ఆగమ శాస్త్ర ప్రకారము 30 కి పైగా ఆలయ ప్రతిష్టలు చెయించిన పూజ్యులు   శ్రీమాన్ ఇరగవరపు గోపాలాచార్యుల వారి పర్యవేక్షణలో, యంత్రమునకు , శ్రీరామనామము చెక్కిన శిలాఫలకమునకు   ( లఘు ప్రతిష్ట)  అంకురార్పణముతో , అధివాసములతో  హోమములతో , కళల అవాహనతో  ప్రాణప్రతిష్ట జరుగును.  
       
 నిక్సిప్తము జరుగు   విధానము.స్థూపము 8 ముఖములుగా నిర్మించబడుతున్నది  4 అడుగుల పీఠము పైన 7 అడుగుల స్ఠూపము(  శ్రీరామనామములు నిక్షిప్తము   చేయుటకు )   పై భాగములో 2 అడుగుల స్ఠలము ఖాళీగా వుంచుతున్నాము. ఒక కఱ్ఱకి చిన్న కొక్కెము బిగించి దానితో ఒక్కొక్క మూటను లోనికి జాగ్రత్తగా దించి కొక్కెమును తప్పించి కఱ్ఱను తీసివేస్తాము.

  ఆరాధనతో ,సర్వ సమర్పణముతో,  చిత్త శుద్ధితో ,నిరాడంబరముగా  జరుపుటకు సంకల్పము చేసుకున్నాము. 

 వివరములు అడిగినందుకు ధన్యవాదములు.  
    ------ జై మారుతీ !  జై జై మారుతీ  !!

                                    మీ ఉమాప్రసాద్ 
.

శ్రీ రామ కోటి స్థూపము నిర్మాణ దశలో ఉన్నది



            

   ఆరాధనతో ,సర్వ సమర్పణముతో ,నిరాడంబరముగా    సాగుతున్న యీ సాధకుని ఆధ్యాత్మిక జీవనములో భగవదనుగ్రహముతో   ఎన్నో నిదర్శనములు కలిగినవి.

     గురుదేవులు శ్రీ అంజనేయస్వామి దయతో ఇంత వరకు యీ సాధకుడు భక్తులచే వ్రాయించి సేకరించిన శ్రీరామ నామములలో 13కోట్లు స్థూపముయందు, శ్రీరామ ఆలయ ప్రతిష్టాపనలయందు, 25 అడుగుల   శ్రీ ఆంజనెయస్వామి హ్రుదయస్థానమందు నిక్షిప్తము చేయబడినవి.
   ఇంకా 7కోట్లు  శ్రీరామనామములు ఉన్నవి. ఈ శ్రీరామనామములు యే విధముగా కైంకర్యము అవుతాయో అని ఎదురు చూస్తున్న యీ సాధకునికి  పూజ్యులు శ్రీ సి మోహనరెడ్డిగారు ఫోను చేయడమువలన  యీ సాధకుడు ఏ రాముని సన్నిధిలో ఆధ్యాత్మిక జీవనము ప్రారంభించి సాధన చేశాడో  అరాముని సన్నిధిలో నిర్మితమౌతున్న స్థూపమునందు కైంకర్యము అవడము భగవంతుని ఉనికిని తెలియజేయడమే  అవుతున్నది కదా !
  అంతే కాదు వార్తా పత్రికల ద్వారా భక్తులకు తెలియడము వలన యీ రోజు  ఇప్పటికి మొత్తము    13కోట్లు   సేకరించబడినవి. మరి యీ రామ కార్యము భగవత్సంకల్పము వలననే కదా!!
     ఈ యఙ్ఞములో , ఈ తపస్సులో మీరూ భాగస్తులు అవండి! తేదీ  10-02-2013 లోగా మీరు వ్రాసిన శ్రీరామనామములు పంపించండి!
                                                                                               ----భగవత్భాగవతదాసుడు

                                                                                                    కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్
 
.

15 కోట్లు శ్రీ రామ నామములతో స్థూపము ప్రతిష్ఠాపన


     

భక్తులకు నమస్కారము. విశాఖపట్నము శ్రీ సాలిగ్రామపురము లోని శ్రీ కోదండ రామాలయములో 15 కోట్లు శ్రీరామనామములు నిక్షిప్తము చేసి 15 అడుగుల స్థూపము ప్రతిష్ఠాపనము జరిపించుటకు దైవఙ్ఞులు మంగళశాశనము చేసిరి.    శ్రీ సి మోహనరెడ్డిగారు    ( విశాఖపట్నము పోర్టు ట్రష్తులో డెప్యూటీ చీఫ్ ఇంజనీరుగా పదవీ విరమణ చేశారు.)   స్వయముగా వ్రాసిన ఒక కోటి శ్రీరామ నామములతో శ్రీరామకోటి స్థూప నిర్మాణము తన స్వంత  ఖర్చులతో ప్రారంభించిరి.వారి ఆహ్వానముతో భూమి పూజకు హాజరు అయిన యీ  సాధకుడు   అప్పటికి తన వద్దనున్న 7 కోట్లు శ్రీరామనాములు కూడా  స్థూపములో నిక్షిప్తము జరిపించుదాము అని అడిగితే వారు ఆనందముగా అంగీకరించిరి. వార్తాపత్రికల ద్వారా తెలియజేస్తే ప్రస్తుతము మొత్తము  13 కోట్లు శ్రీ రామనామములు సేకరించబడినవి. స్థూపము ప్రతిష్టాపనము  తేదీ 14-2-2013 న నిశ్చయించిరి. కావున భక్తులకు విన్నపము! 1008 శ్రీరామనామములకు  తక్కువ కాకుండా మీరు వ్రాసి పంపి అపూర్వమైన, మహత్తరమైన ,శక్తివంతమైన , ముక్తిదాయకమైన యీ శ్రీరామ  కార్యము నందు భాగస్తులు అయి మీరు తరించి మమ్ములను ధన్యులుగా చేయమని కోరుతున్నాము.ఇప్పటికే వ్రాసిన శ్రీరామ నామములు కూడా పంపించవచ్చును.       .ధనము కోరడములేదు.మన పర ధనమును పెంచుకుందాము. --------కొమ్మూరు ఉమాప్రసాద్ భాగవతార్ ,49-27-42 ,మధురానగర్ , విశాఖపట్నము , 530016 ,ఆంధ్రప్రదేశ్ ,ఇండియా. సెల్ .9848462805
.