.

తేది 20-04-2010 న సుందరదాసు M.S.రామారావుగారి 18వ వర్ధంతి సంధర్భముగా 635వ సుందరకాండ కధాగానముతో నివాళులు!




ఆంధ్ర లోకమును తన సుందరకాండ గానముతో 1975 నుండి
17 సంవత్సరములపాటు ఉర్రూతలూగించిన
' సుందరదాసు M.S.రామారావుగారు '
తన 72వ సంవత్సరములో అనగా తేది 20-04-1992 న
వైకుంఠధామమును చేరారు.

'సుందరకాండ 'అనే పదము వినగానే ఆయనే జ్ఞాపకము వస్తారు.
మృదు మధురమైన
పదములతో రచించడమే కాకుండా

హృదయాలకు హత్తుకునే రాగములతో స్వరపరచి గానము

చేయడము అనన్య సాధ్యమైనది. ఆయన నమ్మిన
'గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి
'

దగ్గరవుండి ఆయనచేత వ్రాయిస్తే గాని అంత ఆకర్షణ రాదు.
'ఇది నిజము!



'రుక్షుడు 'అనే ఆటవికుడు సప్త మహా ఋషుల చేత ' తారక మంత్రము '
ఉపదేశింపబడి వాల్మీకిగా
మారి ' బ్రహ్మదేవుడిచేత ఆదేశించబడి

'సంస్కృతములో రామాయణమును రచించాడు.

ఆదికావ్యమైన ఆ రామాయణము పండితులకే గాని పామరులకు అందలేదు.
అందుచేత 'వాల్మీకినే '
'తులసీదాసుగా' పంపించి అవధి (హిందీ ) భాషలో
రామాయణమును రచింపచేశారు. అదిఉత్తరాదివారికి మాత్రమే అందింది.

తెలుగువారి(మన) పుణ్యము చేత

తులసిదాసుగా అవతరించిన వాల్మీకి
మోపర్తి
సీతారామారావు గా
అవతారమెత్తి

సుందరకాండతో మొదలు పెట్టి (యుద్ధ కాండలో సగము

వరకు ) రామాయణము వ్రాశారు.

ఇది యీ సాధకుని అనుభూతి!


' రాముడు వదలిన బాణములా నూరు యోజనముల
సముద్రమును దాటి లంకకు వెళ్ళి
సీతమ్మను వెతుకుతాను '

అన్న హనుమ ( సుందరకాండలోని )మొదటి మాటలను ప్రేరణగా

తీసుకొని M.S. రామారావుగారు 'శ్రీ హనుమాను గురుదేవులు
నా యెద పలికిన సీతా రామకధా
! నే పలికెద సీతారామకధా !'

అన్నారు. ఇంకా
నలుగురు భక్తితో ఆలకించగా ,

'నలుగురు భక్తితో ఆలపించగా ' అంటూ
యెందరో తన సుందరకాండను గానము
చేసుకోవచ్చును అని తెలిపారు.

అంతే కాదు ఆయన తన స్వ హస్తాలతో యీ సాధకునికి
తేది
11-09-1978 న ఆశీస్సులతో సుందరకాండ పుస్తకమును యిచ్చారు.

గురుదేవులు శ్రీ
ఆంజనేయస్వామి దయతో యీ సాధకుడు

తేది 30-03-1995 న సుందరకాండ కధాగానము
ప్రారంభించి

M.S. రామారావుగారి 18 వ వర్ధంతి నాడు అనగా
తేది 20-04-2010 న తూర్పు
గోదావరి జిల్లాలో ,అనపర్తి మండలములో,

పొలమూరు గ్రామములో, శ్రీ షిరిడీ సాయి మరియు శ్రీ
అయ్యప్ప దేవాలయముల

10 వ వార్షికోత్సవ సంధర్భముగా 635 సుందరకాండ
గానముతో


' సుందర దాసు M.S.రామారావు గారికి నివాళులు


అర్పించగలగడము '
మహద్భాగ్యముగా భావిస్తున్నాడు.



జై మారుతీ! జై జై మారుతీ !!



.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి