.

శ్రీరామనవమి సందర్భముగా పూర్తి అయిన 632వ సుందరకాండ కధాగానము.






విశాఖలో , వడ్లపూడి కొలనిలో , శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మరియు శ్రీ రామచంద్రస్వామి వారి ఆలయములో తేది 16-03-2010 న ప్రారంభమయిన 632 వ సుందరకాండ కధాగానము యీ రోజున అనగా తేది 23-03-2010న పూర్తి అయినది.
యీ 8 దినములలో భక్తులనుండి ' 5 లక్షలకు పైగా శ్రీరామ నామములు సేకరింపబడినవి సుందరకాండ పూర్తి అవగానే శ్రీరామ నామములు వ్రాయబడిన పుస్తకములకు ఆలయ అర్చకులచే ముందుగా సంప్రోక్షణ చేయించి , మంచి ముత్యములతో అర్చన చేయించి , యీ రోజు కార్యక్రమమునకు వచ్చిన వందలాది భక్తులు అందరికీ ఒక్కొక్క మంచి ముత్యము అందజేయడము జరిగినది.
ఆ ముత్యమును శరీరమునకు తాకినట్టుగా ధరించమని చెప్పడము జరిగినది.ఆ సందర్భముగా పంచ లోహములతోను మరియు నవ రత్నములతోను చేయబడిన ఆభరణములు శరీరానికి తాకినట్టుగా ధరించవలెనని చెప్పడం జరిగినది.


సుందరకాండ కధ గానము సందర్భముగా శ్రీ రామ అపచార దోష నివృత్తికై ప్రతి కుటుంబము వారిచే 5అరటి పళ్ళను శ్రీ సీతా రాములకు నివేదన చేసి వాటిని ప్రసాదముగా తీసుకోవడము జరిగినది.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో........

జై మారుతీ ! జై జై మారుతీ !!

స్వామి రక్ష ! శ్రీరామ రక్ష !!

శ్రీరామ రక్ష ! సర్వ జగద్రక్ష !!



.

1 కామెంట్‌లు:

durgeswara చెప్పారు...

జై శ్రీరాం

కామెంట్‌ను పోస్ట్ చేయండి