.

తేది 15-03-2010 ఉగాది ముందు రోజు [ కొత్త అమావాస్య ] - యీ సాధకునకు గల 3 విశిష్టతలు ప్రత్యేకతలు

1. 1995 సం.లో మార్చి నెలలో [ఉగాది ఘఢియలలోనేకాని ఉగాది ముందురోజు] సుందరదాసు M.S.రామారావు గారి సుందరకాండను శ్రీ రామాయణ ప్రవచన శిరోమణి , భగవత్ స్వరూపులు అయిన శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి మంగళాశాశనములతో యీ సాధకునిచే మొదటి సుందరకాండ గానము ప్రారంభింపబడింది.

2. 1996 సం.లో మార్చి నెలలో [ఉగాది ఘఢియలలోనే కాని ఉగాది ముందు రోజు] యీ సాధకుని నాన్నగారు శ్రీ కొమ్మూరు భాస్కరరావు గారు కీర్తిశేషులయి వైకుంఠధామము చేరారు.

3.తేది ప్రకారము యీ సాధకుని[జననము తేది 15-03-1946] జన్మదినము.


మా నాన్నగారి 14వ వర్ధంతి సందర్భముగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.

శ్లోకము: యస్మాత్ పార్ధివ దేహహ: ప్రాదుర భూద్యేన భగవతా గురుణా !
నంతు నమాంసి సహస్రంతస్మై సర్వజ్ఞ మూర్తయే పిత్రే !!

తాత్పర్యము : ఎవరివలన ఈ భౌతిక శరీరము జన్మించినదో అటువంటి భగవత్ స్వరూపుడైన
సర్వజ్ణమూర్తి అయిన తండ్రికి వేలకొలది నమస్కారములు.


మా నాన్నగారు కీ.శే.కొమ్మూరు భాస్కరరావు గారు తేది 13-04-1909 లో జన్మించారు. తేది 19-03-1996 న పరమపదము చేరారు. వారు అటవీ శాఖలో forest range officer గా పనిచేసేవారు. మా అమ్మగారి నిత్యపూజలు మాకు కనపడేవి కాని నాన్నగారి భక్తి మాకు పైకి కనపడేది కాదు. ఎక్కువగా కేంపులకు వెళ్ళేవారు.ఇంటిలో ఉన్నప్పుడు మాత్రము ఉదయము స్నానము చేయగానే కుర్చీలో కూర్చొని అగరుబత్తీ వెలిగించి కళ్ళు మూసుకొని తదేక ధ్యానములో అర ఘంటకు పైగా ఉండేవారు. పేపర్లలోనివి పుస్తకాలలోనివి దేముడికి సంబంధించినవీ దేశభక్తికి సంబంధించినవీ సేకరించేవారు. ఆయన వ్రాసుకోవడానికి అవకాశము లేనప్పుడు మా చెల్లెళ్ళ చేత వ్రాయించుకునేవారు. అవన్నీ సుమారు 18 పుస్తకాలలో ఉన్నాయి. ఆంగ్లము లోను ,తెలుగులోను సేకరించారు. వాటికి ఆయన A READERS HAARVEST అని పేరుపెట్టుకున్నారు. అందులో భక్తికి సంబంధించినవాటిని [ తెలుగు లోనున్నవి ] యీ సాధకుడు విజ్ణానభాస్కరం అని పేరుపెట్టి వాటిలోనివి అప్పుడప్పుడు యీ [ blog] అంతర్జాలము లో వ్రాస్తున్నాడు.
అంతర్జాలమితృలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జై మారుతీ ! జై జై మారుతీ !!
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి