.

ఫ్రపంచములోని అన్ని జీవులకన్నా ప్రమాదకరమైన జీవి

లండనులో ఒక పెద్ద జంతు ప్రదర్శనశాల ఉంది. ఆందులో ప్రపంచములోనున్న అన్ని రకముల పక్షులనూ,జంతువులనూ ప్రదర్శిస్తుండేవారు. నిర్వాహకులు ఎప్పటికి అప్పుడు కొత్త కొత్త వాటిని సేకరించి అక్కడ ప్రదర్శిస్తుండడము వలన సందర్శకులకు కొత్తదనము వుండేది. ఫ్రతీ జంతువు/పక్షి ముందు వాటి వివరాలతో బోర్దులు పెట్టేవారు. ఎన్నో రకముల కౄర మృగాలనూ, సాధు జంతువులనూ, సర్పాలనూ, మొసళ్ళనూ,రక రకముల పక్షులనూ చూస్తూ వాటి వివరాలను చదువుకుంటూ వెళ్తున్న వారికి చివరగా ఒక పెద్ద బోర్డు కనిపించింది. అందులో “మీరు ఇప్పుడు ప్రపంచములోని అన్ని జీవులకన్నా అతి ప్రమాదకరమైన జీవిని చూడబోతున్నారు. ఆ జీవిలో ఇంతవరకూ మీరు చూసిన వాటి అన్నిటి గుణాలూ మేళవించి ఉన్నాయి “ అని వ్రాసి ఉంది. అది చదివిన వారు ఆ అతిప్రమాదకరమైన జీవిని చూడడానికి ఆతృతతో లోనికి వెళ్ళారు. అక్కడ పెద్ద అద్దము వుంది . అందులో ఎవరిని వారే చూసుకుంటున్నారు!
-- సుమారు 25 సంవత్సరముల క్రిందట ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో మొదటి పేజీలో పైన కుడిప్రక్కన చిన్న బాక్సులో [ ఆ రోజులలో ఇటువంటివే వ్రాసేవారు] యీ సాధకుడు చదివాడు. జంతువులు,పక్షులు,మొసళ్ళు, పాములు - ఆహార,నిద్రా మైధునాలను ఒక క్రమమైన పద్దతిలో నిర్వహిస్తాయి కాని మనిషికి ఆ విచక్షణా జ్ఞానము లేదు. ఏ క్షణములో ఎలా మారిపోతాడో తెలియదు. నైతిక విలువలను పాటించడు. సమాజములో తన ఆదిపత్యమే లక్ష్యముగా, ఆశలకు అంతులేకుండా, స్వార్ధమే పరమావధిగా సాగిపోతున్నాడు. ఏవరయినా తనకు ఏది చెయ్యకూడదు అనుకుంటున్నాడో అది తను ఇంకొకరికి చెయ్యకూడదన్న వివేకము ఎప్పుడు వస్తుందో - అప్పుడే సమ సమాజము ఆవిష్కరింపబడుతుంది. మనిషి మనుగడ బావుంటుంది. ఆ రోజులకోసం ఎదురు చూద్దాం.
కౄర మృగమ్ముల కోరలు తీసెను –
ఘో రా ర ణ్య ము లా క్ర మించెను-
హిమాలయము పై జండా పాతెను-
ఆకాశములో విహారం చేసెను-
అయినా..ఆ.. మనిషి మారలేదూ –
ఆతని వాంచ తీరలేదూ ‘
ఇది అక్షర సత్యమే కదా!
"గురు దేవులు శ్రీ అంజనేయ స్వామి దయతో యీ సాధకుడు మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నము చేస్తాడు. అన్నట్టు 'దేముడిని తరిమేశాం ' అని దీనికి ముందు వ్రాసినది " శ్రీ కంచి కామ కోటి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి వారు " 1982 లో విశాఖలో చెప్పారు. జై మారుతీ జై జై మారుతీ .
-----ఉమాప్రసాద్ కొమ్మూరు.{తెలుగు బ్లాగు 18782}
.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి