.

తేది 24-03-2010 శ్రీరామనవమి నాటికి 19 కోట్ల, 17 లక్షలకు పైగా శ్రీరామనామముల సేకరణ గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయవలన పూర్తి అయినవి. ..... ఒక సాధకుని ఆత్మ కధ -6 .

నిరంతరము శ్రీ రామ మంత్రమును జపిస్తూ ఉండే పరమేశ్వరుడు కాశీకి వచ్చిన భక్తులు చనిపోతుంటే వారి చెవిలో శ్రీరామనామమును పలికి వారికి మోక్షమును సుగమమును చేస్తాడు. ఆ పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహించాడేమో ?

నిరంతరము హనుమాన్ చాలీసాను, శ్రీరామ నామమును భక్తుల చేత పలికిస్తున్నందుకు అసాద్య సాధక సాధనపరుడైన గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి దయ కలిగిందో ?

దైవ స్వరూపులయిన శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామివారి వాత్సల్య పూరిత మంగళాశాశనముల వలననో ?

ప్రత్యక్ష దైవములయిన మా అమ్మగారు కీ.శే. వెంకటరత్నముగారు మరియు మా నాన్నగారు కీ. శే. భాస్కరరావుగారుల ప్రేమపూరిత వాత్సలముల వలనో ?

-- యీ సాధకునికి అనన్య సామాన్యమయిన అసాధ్యమయిన సామూహిక శ్రీరామనామ లిఖిత జపము సాధ్యపడినది.

ఈ సాధకునికే ఆశ్చర్యముగా వింతగా మొత్తము 21 కోట్లు శ్రీరామ నామములు సేకరించబడినా అందులో 2 కోట్లు నామములలో స్పష్టత లేదు. చాలామంది సముద్రపు అలలలాగానో లేక ఉత్తి సున్నాలనో వ్రాశారు. అవన్నీ తీసివెయగ

19 కోట్లు శ్రీరామ నామములు



పూర్తి
అయినాయి.


పందొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరము జనవరిలో సామూహిక శ్రీరామకోటి లిఖిత యజ్ఞము ప్రారంభమయ్యింది. అప్పటినుండి రెండు వేల నాల్గవ సంవత్సరము వరకు మొత్తము పదమూడు కోట్ల శ్రీరామనామములు సద్వినియోగమయిన వివరములు:-

విశాఖలో, కొత్త వెంకోజీ పాలెమునందు శ్రీ జ్ఞానానంద ఆశ్రమములో 5 కోట్లు శ్రీరామనామములు 15 అడుగుల శ్రీరామకోటి స్థూపమునందు నిక్షిప్తము జరిగినవి.

విశాఖ , బర్మా కేంపులో ఒక కోటి శ్రీరామనామములు శ్రీ సీతారామ విగ్రహముల ప్రతిష్ఠ సమయములో నిక్షిప్తము చేయబడినాయి.

విశాఖ, రైల్వే న్యూకోలనీ లోగల పరదేశ రామాలయమునందు ఒక కోటి శ్రీరామనామములు అంకితమయినాయి.

విశాఖ ,పెందుర్తి సాధు ఆశ్రమము నందు హృదయములో శ్రీ సీతా రామ లక్ష్మణులు గల, 25 అడుగుల శ్రీ ఆంజనేయస్వామి విగ్రహ హృదయ స్థానములో ఒక కోటి శ్రీరామనామములు నిక్షిప్తము చేయబడినవి.

విశాఖ, అల్లిపురము వద్ద శ్రీ వేంకటేశ్వర మెట్ట యందు గల హరే రామ మందిరములో 4.5 కోట్లు శ్రీ రామ నామములను మందిరము అభివృద్దికి ఉంచితే విగ్రహ ప్రతిష్ఠాపన సమయములో నిక్షిప్తము జరిపించిరి.

ఒక భక్తులు కోటి శ్రీరామనామములు వ్రాద్దామనుకున్నారు కానీ వ్రాయలేకపోయారు. ఏభై లక్షల వరకు వ్రాయగలిగారు. భద్రాచలము వెళ్తున్నాను మీరు 50 లక్షల శ్రీరామనామములు యిస్తే రామయ్యకు కైంకర్యము చేస్తానని అడిగారు. ఆయన ఆర్తి, ఆయన వయస్సు చూసి 50 లక్షల శ్రీరామనామములు ఆయనకు యివ్వడము జరిగింది.

మొత్తము 13లక్షల శ్రీరామనామములు రామయ్యకు కైంకర్యము అయినాయి.

ప్రస్ఠుతము 6 కోట్లు
శ్రీరామనామములు ఉన్నవి.



[S.K అనగా సుందరకాండ అనియు, అంకెలు శ్రీరామనామముల సంఖ్యలనియు గమనించమని కోరిక.]
[ శ్రీరామనామములు]
01/05 విశాఖ.శాంతి ఆశ్రమములో. ............................. S.K. 487--- 4,00,000.
03/05 విశాఖ జగన్నాధస్వామి ఆలయం ....................... S.K. 491--- 4,00,౦౦౦.
03/05 చాగల్లు.[wg]షుగర్ ఫేక్టరీ ................... S.K. 493--- 21,80,౦౦౦.
04/05 విశాఖ.మర్రిపాలెం NH5 ................................... S.K. 496--- 3,00,౦౦౦.
05/05 మడపాం.SKLM.Dt,[175అ.హనుమ] .............. S.K. 499---24,00,౦౦౦.

07/05 గొల్లల మామిడాడ.రామాలయం.[E.G ] ................. S.K. 505--- 7,20,౦౦౦.
08/05 అనపర్తి.శ్రీ సాయి,శ్రీరామ మందిరం.[E.G] .............. S.K. 506-- 14,00,౦౦౦.
09/05 విశాఖ.శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయం. ..................... S.K. 508---3,00,౦౦౦.
11/05 విశాఖ.కైలాసపురం. శ్రీరామ,వేంకటేశ్వర ఆలయం. ...... . S.K 514--- 3,00,౦౦౦.
11/05 తాపేశ్వరం.ఉమా రామలింగేశ్వర ఆలయం [E.G] .......... S.K515--- 5,00,౦౦౦.

01/06 భద్రాచలం.శ్రీ సీతా రామచంద్రమూర్తి ఆలయం. ..............S.K---516--5,00,౦౦౦.
02/06 విశాఖ.శాంతి ఆశ్రమం. ........................................... S.K 518--- 1,00,౦౦౦.
04/06 విశాఖ.రాజీవ్ నగర్.రామ ఆలయం. .........................SK 524---. 15,00,౦౦౦.
04/06 విశాఖ.శ్రీ వైభవ వేంకటేశ్వరస్వామి ఆలయం. ............... S.K525---. 6,00,౦౦౦.
05/06 అనపర్తి. E.G శ్రీ ఆంజనేయరెడ్డి కళ్యాణమండపం. ..........S.K 530---. 3,20,౦౦౦.
05/06 జగదల్ పూర్. [చత్తీశ్ ఘడ్ ] రుద్రయాగం.--- .................................... 70,000 .
06/06 శ్రి వేంకటేశ్వర రావు గారి యిల్లు. ................................. S.K 531--- 1,00,000.
09/06 నేలకొండపల్లి. శ్రీ భద్రాచల రామదాసు గారి స్వగృహము. ..... .S.K 545- 6,30,000.
10/06 విశాఖ. మురళీ నగర్. అమ్మ రెసిడెన్సీ ......................... S.K 548--- 6,50,000.
11/06 జియ్యమ్మ వలస.[VZM జిల్లా]. ................................. S.K 550-- 12,75,000.
111/06 నరసన్నపేట.శ్రీకాకుళం జిల్లా. పంచాయత్ ఆఫీస్సులో .........S.K 551- 20,00,000.
12/06 కొత్తూరు. శ్రీకాకుళం జిల్లా.వేంకటేశ్వరస్వామి ఆలయములో..S.K553--- 25,50,000.
2007 లో చాగల్లు.W.G. షుగర్ ఫేక్టరీ. .......................... S.K561--- 7,00,000.
2007 లో భీమిలి.విశాఖ జిల్లా. సుందర వనము ఆశ్రమము. . .......... S.K565--- 5,00,000.
2007 లో రాయఘడ్.[ఒరిస్సా] శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం. ....... S.K 567--.-9,50,000.
2007 లో విశాఖ.వడ్లపూడి కోలనీ. శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయము... S.K 560---5,00,000.
2007 లో కోటబొమ్మాళి. శ్రికాకుళం జిల్లా. కళ్యాణమండపం. ............... S.K -------9,00,000.
2008 లో ఖమ్మం. శ్రీ వేంకటేశ్వర ఆలయం.----------------------------------- - 5,30,000.
2009 లో విశాఖ. మురళీనగర్. స్కేటింగ్ పార్కు.. ------------------- S.K618--- 9,00,000.
2009 లో. విశాఖ. నడుపూరు.శ్రీ రామ ఆలయము.----------------- . S.K 619---2,00,000.
2009 లో భీమవరం. W.G శ్రీ రామ ఆలయము. . .................... S.K 620---5,00,000.
2010 లో వడ్లపూడి కోలనీ. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయము. ....... s.k 632--- 5,00,000.

పై కార్యక్రమములలో సేకరించబడినవి మొత్తము -- 2కోట్ల, 53లక్షల, 75వేలు.

ఇంటివద్దకు వచ్చి పుస్తకములు తీసుకొని వ్రాసి యిచ్చినవారూ,

వారు వ్రాసినవి తెచ్చి యిచ్చినవారివీ కలిపి -3కొట్ల, 63లక్షల, 49వేల, 713.



మొత్తము 6కోట్ల ,17లక్షల, 24వేల,


713 నామములు ప్రస్ఠుతము ఉన్నవి.


ఇన్ని చేయించిన స్వామి యీ శ్రీరామనామములను యెవరి ద్వారా, యెక్కడ సద్వినియోగము చేయిస్తారోనని యీ సాధకుడు యెదురు చూస్తున్నాడు.

జై మారుతీ! జై జై మారుతీ !!
స్వామి రక్ష ! శ్రీరామ రక్ష !!


శ్రీరామ రక్ష ! సర్వ జగద్రక్ష !!


మాతృ దేవో భవ ! పితృ దేవో భవ !! ఆచార్య దేవో భవ !!!






.

శ్రీరామనవమి సందర్భముగా పూర్తి అయిన 632వ సుందరకాండ కధాగానము.






విశాఖలో , వడ్లపూడి కొలనిలో , శ్రీ వేంకటేశ్వరస్వామి వారి మరియు శ్రీ రామచంద్రస్వామి వారి ఆలయములో తేది 16-03-2010 న ప్రారంభమయిన 632 వ సుందరకాండ కధాగానము యీ రోజున అనగా తేది 23-03-2010న పూర్తి అయినది.
యీ 8 దినములలో భక్తులనుండి ' 5 లక్షలకు పైగా శ్రీరామ నామములు సేకరింపబడినవి సుందరకాండ పూర్తి అవగానే శ్రీరామ నామములు వ్రాయబడిన పుస్తకములకు ఆలయ అర్చకులచే ముందుగా సంప్రోక్షణ చేయించి , మంచి ముత్యములతో అర్చన చేయించి , యీ రోజు కార్యక్రమమునకు వచ్చిన వందలాది భక్తులు అందరికీ ఒక్కొక్క మంచి ముత్యము అందజేయడము జరిగినది.
ఆ ముత్యమును శరీరమునకు తాకినట్టుగా ధరించమని చెప్పడము జరిగినది.ఆ సందర్భముగా పంచ లోహములతోను మరియు నవ రత్నములతోను చేయబడిన ఆభరణములు శరీరానికి తాకినట్టుగా ధరించవలెనని చెప్పడం జరిగినది.


సుందరకాండ కధ గానము సందర్భముగా శ్రీ రామ అపచార దోష నివృత్తికై ప్రతి కుటుంబము వారిచే 5అరటి పళ్ళను శ్రీ సీతా రాములకు నివేదన చేసి వాటిని ప్రసాదముగా తీసుకోవడము జరిగినది.

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో........

జై మారుతీ ! జై జై మారుతీ !!

స్వామి రక్ష ! శ్రీరామ రక్ష !!

శ్రీరామ రక్ష ! సర్వ జగద్రక్ష !!



.

మహా మనీషి , సద్గురువులకు గురువు, శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి 88 వ జయంతి శ్రీరామనవమి నాడే!




ప్రవచన శిరోమణి , ఉభయ వేదాంత ప్రవక్తకులు , మహా మహోపాధ్యాయులు , దైవాంశ సంభూతులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి జయంతి సందర్భముగా వారితో పరిచయమున్న ఒక సాధారణ భక్తుడుగా వారితో గల కొద్దిపాటి పరిచయమును పునస్కరించుకొని వారి గురించి మన అంతర్జాల మితృలకు తెలియజేసే సాహసమునకు పూనుకుంటున్నాను.

అస్సలు అటువంటి మహనీయుని గురించి మాట్లాడడానికే యెటువంటి అర్హత గాని , స్థాయి గాని , పరిజ్ఞానము గాని యీ సాధకుడికి లేవు. అయినా సాహసము చేస్తున్నాను. శ్రీరాముడు చాతుర్వర్ణాలవారికీ దేవుడే! శ్రీరాముని పూజించే అవకాశము అందరికీ ఉంది. అదే విధముగా గొప్ప వారిగురించి రెండు మాటలు చెప్పుకునే అవకాశము యీ సాధకునికీ ఉంది.

కొన్ని వేలమంది వారి ఉపన్యాసము వింటుంటారు. అయితే ప్రతీ ఒక్కరికీ వారు తనతోనే చెప్తున్నారన్న భావము కలుగుతుంది. సాధారణ భక్తులకూ , మహా జ్ఞానులకూ యెవరి స్థాయికి తగ్గట్టుగా వారికి అర్ధమవుతుంది. ఇది అపూర్వము.

దివంగత తెన్నేటి విశ్వనాధం గారు దేశ భక్తులు , విశాఖవాసులకు ప్రియమైన వారు. ఆయన తన సన్నిహితులతో ' కొంత మంది మాట్లాడుతుంటే వినాలి అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడుతుంటే చాలా బాగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. కాని శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు మాట్లాడుతుంటే సాక్షాత్తూ సరస్వతీదేవి వారి నాలుక మీద నాట్యము చేస్తున్నాదా ! అనిపిస్తుంది ' అని తరచుగా అనేవారు.

వారివద్ద కొన్నాళ్ళు బ్రహ్మ సూత్రాలు మొదలగునవి నేర్చుకొని వారు పెట్టిన పరీక్షలలో ఉత్తీర్ణులయి కొందరు జియర్ స్వాములు అయ్యారని పెద్దలు చెప్తారు.

అప్పలాచార్యస్వామి వారికి ధనిక ,పేద అన్న తేడా లేదు. తన వద్దకు వచ్చిన భక్తులను వారు ఆదరించే తీరు అమోఘము. దైవ కార్యాలలో వారి సలహాల కోసము వచ్చిన వారికి వచ్చిన వారి స్థాయికి తగ్గట్టుగా సూచనలు యిస్తారు. వారిగురించి యిలా యెంత చెప్పినా తక్కువే అవుతుంది.

యీ సాధకునికి వారితో యెన్నో విషయాలలో కొద్దిగా సాన్నిహిత్యము యేర్పడింది.

మొదటగా 3 నెలలలో సామూహికముగా ఒక కోటి శ్రీరామనామములు వ్రాయించగలిగానని వారే నన్ను పిలిపించుకొని 1986 జూన్ నెలలో పూజా కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపించారు.

యీ సాధకుడు 4 సంవత్సరములు భగవత్ విషయములు సేకరించి ఆధ్యాత్మిక దర్పణము పేరుతో 1/8demmy size లో 200 పేజీలు ముద్రణకు సిద్దపడితే వారు ఓపికతో అన్ని పేజీలను దిద్ది, మంగళాశాసనములు వ్రాయడమే కాకుండా క్రిష్ణా ఆశ్రమములో అప్పటి పోర్టు ట్రష్టు చైర్మెన్ గారయిన శ్రీమాన్ P.V.R.K.ప్రసాద్ గారితో కలసి 1989 మే నెలలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు.

1978 లొ సుందరదాసు M.S.రామారావుగారు ఆశీస్సులతో సుందరకాండ పుస్తకమును యిచ్చినా గురుదేవులు శ్రీ ఆంజనేయస్వామి 1995 మార్చ్ నెలలో గానము చేసే అవకాశము యిచ్చారు. ఒక వారము రోజులుగా సాధన చేస్తున్నాము. ఆ విషయము వారికి యెవరో చెప్పితే వెంటనే నన్ను తీసుకొని రమ్మని చెప్పారు. నెను వెళ్ళితే కొద్దిగా పాడించుకొని తేది 30-03-1995 న వారు వచ్చి మొదటి గానమును ప్రారంభింపజేస్తాను అన్నారు. అప్పటికి ఒక వారము గూడా పూర్తిగా లేదు.స్వామీ కష్టమండీ! అని వేడుకున్నా ఫరవాలేదు మీరు తయారవుతారు అని నమ్మకంగా చెప్పడమే కాకుండా అదే దినమున మొదటి సుందరకాండ కార్యక్రమమును ప్రారంభింపజేసారు.

అర్ధాలతో కూడిన హనుమాన్ చాలీసా మరియు కొన్ని శ్లోకములతో కూడిన పుస్తకమును ముద్రించడానికి మొదటి విరాళము[100 రూపాయలు] వారు యిచ్చి యీ పుస్తకాలు లక్షకు పైగా ముద్రించ బడతాయని మంగళాశాసనము చేశారు. అవి యిప్పటికి ఒక లక్షా పదమూడు వేలు ముద్రించబడిభక్తులచే ఆదరించ బడుతున్నాయి .
ఇక వారి జననము విషయానికి వస్తే వారి తల్లి తండ్రులు సంతానము కోసము సింహ గిరి {శ్రీ సిం హాచలము దేవస్థానము} చుట్టూ ప్రదక్షిణము చేసేరని ,అప్పలాచార్యస్వామి వారు శ్రీ రామ నవమి నాడు జన్మించేరని ,వారు శ్రీ వరాహ లక్ష్మీ నరసిం హ స్వామి వారి మానస పుత్రులని వారి భక్తులు అంటారు.

శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారు దైవాంశ సంభూతులు. భౌతికముగా వారు లేకపోవచ్చును గాని కొన్ని వేల మంది హృదయాలలో వారు చిరంజీవిగా వుంటారు.
వారు తన భక్తులను ,అభిమానులను సదా

కాపాడుతుంటారనే నమ్మకము మా అందరికీ వుంది.




.